సైబర్ కేటుగాళ్లు… నిందితుల్లో బ్యాంకు అధికారులు
తెలంగాణ : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్ల గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టుచేశారు. ఆక్టోపస్ పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టి 16 రాష్ట్రాల్లో 104 మంది కేటుగాళ్లను అరెస్టు చేశారు. వీరిలో బ్యాంకు అధికారులు ఉండడం గమనార్హం. వీరు ₹127 కోట్లకు పైగా కొట్టేశారు. నిందితుల నుంచి ₹36 లక్షల నగదు, 200కు పైగా మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై 1,055 కేసులు ఉన్నట్లు గుర్తించారు.










Comments