అరుదైన రికార్డు.. వరల్డ్ క్రికెట్లో ఒకే ఒక్కడు
భారత స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పారు. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసి భారత్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్(51), ఆస్ట్రేలియా(64), భారత్.. మూడు దేశాల్లో 50 వికెట్లు తీసిన ప్లేయర్గా బుమ్రా నిలిచారు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లోని యాక్టివ్ ప్లేయర్లలో ఈ ఘనత సాధించింది అతనొక్కడే కావడం విశేషం.
Comments