ఎండల్లో వర్షాలు.. పొంచి ఉన్న జ్వరాల ముప్పు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పగటిపూట ఎండలు దంచికొడుతుండగా రెండ్రోజుల నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఇలా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. తాజా ఆహారంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలంటున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటే వైరల్ ఫీవర్లు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.










Comments