• Oct 21, 2025
  • NPN Log

    పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆ రెండు దేశాల క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. త్వరలో పాకిస్థాన్ లో జరగాల్సిన ట్రై సిరీస్ నుంచి ఆఫ్గాన్ జట్టు తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో తమ ముగ్గురు యువ క్రికెటర్లు మరణించడంతోనే ఆఫ్గాన్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా పాక్ కు ఆఫ్గానిస్తాన్ మరో షాకిచ్చింది. తన అండర్-19 జట్టును పాకిస్తాన్‌కు బదులుగా భారత్‌కు పంపాలని నిర్ణయించింది.


    పాకిస్థాన్ తో ఆడటానికి నిరాకరించిన అఫ్గనిస్థాన్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. అఫ్గనిస్థాన్ అండర్-19 క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జింబాబ్వే, నమీబియాల సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న అండర్-19 ప్రపంచ కప్ కోసం సన్నాహకంగా ఈ ట్రై సిరీస్ ఉపయోగపడుతుంది.


    ఆఫ్గనిస్థాన్ అండర్-19, ఇండియా అండర్-19 'ఏ',ఇండియా అండర్-19 'బీ' జట్టులో ట్రై సిరీస్ ను ఆడనున్నాయి. ఈ యువ వన్డే ట్రై సిరీస్ 2025 నవంబర్ 17న ప్రారంభమవుతుంది. ప్రతి జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానం సంపాదించిన టాప్-2 జట్ల మధ్య నవంబర్ 30న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరగనున్నాయి. ఇలా తమ క్రికెటర్లను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ కు ఆఫ్గానిస్తాన్ షాకుల మీద షాకిలిస్తుంది.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement