• May 26, 2026
  • NPN Log

    సింహగిరి శనివారం భక్తజనసంద్రమైంది. రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడం, శుక్రవారం రాత్రి, శనివారం వేకువజామున ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేసుకున్న నవ వధూవరులు, వారి కుటుంబ సభ్యులు అప్పన్న దర్శనానికి తరలిరావడంతో కొండ కిటకిటలాడింది. కేశఖండనశాల, గంగధార, ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద, అన్న ప్రసాద భవనం వద్ద భక్తుల సందడి కనిపించింది. దేవస్థానం ఈఓ జల్లేపల్లి వెంకటరావు స్వయంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరణకు నడుం బిగించి, సిబ్బందికి సమయానికి తగ్గట్టు సూచనలు ఇచ్చారు.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement