పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బుధవారం కూడా రేట్లు భారీగా పెరిగాయి. బంగారాన్ని మించిపోయిన వెండి మదుపర్లకు లాభాలను కురిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, గురువారం (డిసెంబర్ 18) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 660 మేర పెరిగి రూ.1,34,520కు చేరుకుంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర రూ. 610 మేర పెరిగి రూ.1,23,310కు చేరింది. వెండి ధర మాత్రం అసాధారణ రీతిలో పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.9 వేల మేర పెరిగి రూ.2,08,100కు చేరుకుంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందన్న సంకేతాలు బంగారం, వెండికి డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో స్వల్పంగా పెరిగిన నిరుద్యోగిత, డాలర్ బలహీనపడ్డ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనాలైన బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. ఇక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు కూడా కీలకమైన వెండి సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల రేట్లు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో కూడా పసిడి, వెండికి గిరాకీ ఇదే రీతిలో కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,35,290; ₹1,24,010; ₹1,03,510
ముంబై: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890
న్యూఢిల్లీ: ₹1,34,670; ₹1,23,460; ₹1,01,040
కోల్కతా: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890
బెంగళూరు: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890
హైదరాబాద్: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890
విజయవాడ: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890
కేరళ: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890
పుణె: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890
వడోదరా: ₹1,34,570; ₹1,23,360; ₹1,00,940
అహ్మదాబాద్: ₹1,34,570; ₹1,23,360; ₹1,00,940
వెండి (కిలో) ధర..
చెన్నై: ₹2,22,100
ముంబై: ₹2,08,100
న్యూఢిల్లీ: ₹2,08,100
కోల్కతా: ₹2,08,100
బెంగళూరు: ₹2,08,100
హైదరాబాద్: ₹2,22,100
విజయవాడ: ₹2,22,100
కేరళ: ₹2,22,100
పుణె: ₹2,08,100
వడోదరా: ₹2,08,100
అహ్మదాబాద్: ₹2,08,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.










Comments