సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ బి.ఆర్.నాయుడు భేటీ అయ్యారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో చేపట్టబోయే ఏర్పాట్లపై వారిద్దరూ చర్చించినట్టు సమాచారం. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ మధ్య సుమారు అరగంటసేపు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇతర అంశాలు వీరి చర్చల్లో ప్రస్థావనకు వచ్చినట్లు సమాచారం.
Comments