సాగరంలో సాహస యాత్రకు సిద్ధమైన నారీశక్తి
భారత త్రివిధదళాలకు పదిమంది మహిళాఅధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టే సాహసయాత్రకు సిద్ధమైంది. దీనికి సముద్రప్రదక్షిణ అని పేరు పెట్టారు. ఇందులో భాగంగా ఏకధాటిగా 26,000 నాటికన్ మైళ్లు ప్రయాణించనున్నారు. అత్యంత కఠినమైన దక్షిణ మహాసముద్రం, డ్రేక్ పాసేజ్ జలాల్లో ఈ యాత్ర సాగనుంది. ఈ బృందం వచ్చే ఏడాది మేలో ముంబైకి చేరుతుందని అంచనా. దీనికోసం గత మూడేళ్లుగా ఈ బృందం కఠిన శిక్షణ పొందుతోంది.
Comments