• Jul 26, 2026
  • NPN Log

    ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి  లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే  లేఖ రాశారు. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం వివాదం గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌నకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే ఒక స్వతంత్ర, సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కోరారు.

    స్పష్టమైన దర్యాప్తు జరగాలి..

    భక్తులు సమర్పించిన నగదుతో పాటు బంగారం, వెండి వంటి అన్నిరకాల కానుకల నిర్వహణపై కూడా స్పష్టమైన దర్యాప్తు జరగాలని లేఖలో రాహుల్, ఖర్గే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ నివేదికతో పాటు ట్రస్టునకు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించారో వెంటనే తెలపాలని రాహుల్ గాంధీ, ఖర్గే డిమాండ్ చేశారు.

    మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు..

    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అందులోని సభ్యులందరినీ ప్రభుత్వమే నియమించిందని రాహుల్, ఖర్గే ప్రస్తావించారు. ట్రస్టు సభ్యులంతా RSS, VHP వాటి అనుబంధ సంస్థలకు చెందినవారని తెలిపారు. ఈ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడని వెల్లడించారు. ఇంత పెద్ద నేరం జరుగుతున్న మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో జవాబుదారీగా ఉండటం ప్రధాని బాధ్యత అని చెప్పుకొచ్చారు. అవినీతికి కారణమైన వారు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంతటి ప్రభావవంతమైన వ్యక్తులైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్, ఖర్గే డిమాండ్ చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement