అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చివరికి కథ సుఖాంతం..
హైదరాబాద్: దోమలగూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికల అదృశ్యం కేసులో సికింద్రాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ముగ్గురు చిన్నారులు ఛత్తీస్గఢ్లో ఉన్నట్లు గుర్తించి వారిని చాకచక్యంగా కాపాడారు. అనంతరం హైదరాబాద్లోని ఓ సఖీ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. తల్లిదండ్రులు తరచూ గొడవల పడటంతోనే బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు.










Comments