మార్కెట్లోకి కియా సైరోస్ ఈవీ
న్యూఢిల్లీ: కియా ఇండియా.. మార్కెట్లోకి సైరోస్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. 42 కేడబ్ల్యూ, 51.4 కేడబ్ల్యూ వేరియంట్లతో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ కారు ప్రారంభ ధరలు వరుసగా రూ.13.49 లక్షలు, రూ.16.99 లక్షలు (ఎక్స్షోరూమ్)గా ఉన్నాయి. ఈ నెల 30 నుంచి సైరోస్ ఈవీ విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. 51.4 కేడబ్ల్యూ కారు ఒకసారి చార్జింగ్తో 526 కిలోమీటర్లు, 42 కేడబ్ల్యూ కారు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలిపింది.










Comments