హెచ్సీఏ మహిళల సెలెక్షన్ కమిటీ చైర్మన్గా సువర్ణ లక్ష్మి
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మహిళా సెలెక్షన్ కమిటీ చైర్మన్గా సువర్ణ లక్ష్మి నియామకానికి ఏకసభ్య కమిటీ చీఫ్, రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు ఆమోదం తెలిపారు. లక్ష్మి చైర్మన్గా, అనిత మిశ్రా, సంగీత, కీర్తన, ఏక్తా సక్సేనాను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ ఏడాది పాటు కొనసాగనుంది. హైదరాబాద్ సీనియర్, జూనియర్ మహిళా జట్లను ఈ కమిటీ ఎంపిక చేయనుంది.










Comments