కాలి నడకన తిరుమల శ్రీవారి దర్శనానికి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా..
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గంలో కాలి నడకన తిరుమల చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన భార్య లెజ్నోవా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.










Comments