ప్రయాణంలో ఈ ఫుడ్స్ తింటే డేంజర్
లాంగ్ డ్రైవ్స్, వీకెండ్ ట్రిప్స్ ఇప్పుడు చాలా మందికి సాధారణంగా మారిపోయాయి. ముఖ్యంగా హైవేల వెంట కనిపించే ధాబాలు, ఫుడ్ స్టాల్స్ వద్ద ఆగి తినడం చాలామందికి ఇష్టం. అయితే, ప్రయాణ సమయంలో ఏది పడితే అది తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైవేలపై దొరికే కొన్ని ఆహార పదార్థాలు జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, అలసటకు కారణమవుతాయని చెబుతున్నారు. అందుకే హైవే జర్నీల్లో కొన్ని ఫుడ్స్కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ నూనె, మసాలా ఉన్న ఆహారం
హైవే పక్కన దొరికే పకోడీలు, సమోసాలు, ఫ్రై ఐటమ్స్, మసాలా కర్రీలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ ఇవి అధిక నూనెతో తయారవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, అసిడిటీ, అలసట వంటి సమస్యలు వస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నవారికి నిద్రమత్తు కూడా కలిగే ప్రమాదం ఉంది.
కట్ చేసిన పండ్లు తినేటప్పుడు జాగ్రత్త
రోడ్డు పక్కన ముందుగానే కట్ చేసి ఉంచిన పండ్లు బయట దుమ్ము, కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. శుభ్రత లేకపోతే బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే తొక్క తీసి తినే పండ్లు లేదా సీల్ చేసిన ప్యాక్డ్ ఫ్రూట్స్ ఎంచుకోవడం మంచిది.
చల్లని డ్రింక్స్ కంటే నీళ్లు మంచివి
కూల్ డ్రింక్స్, సోడాలు తాగితే కొద్దిసేపు ఫ్రెష్గా అనిపించినా, తర్వాత శరీరంలో నీరసం పెరిగే అవకాశం ఉంటుంది. వీటిలో చక్కెర అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా రావచ్చు. అందుకే సాధారణ నీరు, కొబ్బరి నీరు లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు.
డైరీ ఉత్పత్తులు
లస్సీ, మజ్జిగ, పనీర్ వంటి పదార్థాలు ఎండాకాలంలో త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి శుభ్రత ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఇలాంటి ఆహారం తీసుకోవాలి.
మళ్లీ వేడి చేసిన ఆహారం
కొన్ని హోటళ్లలో ముందే తయారు చేసిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి అందిస్తుంటారు. ఇలా చేసిన ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తాజాగా వండిన వేడి ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.
తక్కువగా తింటేనే మేలు
ప్రయాణ సమయంలో అతిగా తినడం వల్ల అలసట, నిద్రమత్తు పెరిగి డ్రైవింగ్పై ప్రభావం పడుతుంది. లైట్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్, పండ్లు, నీరు వంటి వాటిని తీసుకుంటే శరీరం ఉత్సాహంగా ఉంటుంది.









Comments